Sunday 29 March 2015

అన్నా హజారేది ఏ ప్రజల గొంతుక ?

అన్నా హజారే గాంధేయ వాదినని చెప్పుకుంటాడు.
కానీ అతను ప్రతిపాదిస్తున్న జన లోకపాల్ బిల్లు గాంధేయవాదానికి వ్యతిరేకమైనది.
అయినా రేయింబవళ్ళూ సాగిన కార్పోరేట్ మీడియా ప్రచారం
అతడిని 'ప్రజల గొంతుక' గా పేర్కొంది.
అమెరికాలో " వాల్ స్ట్రీట్  ముట్టడి " ఉద్యమంలా కాకుండా
హజారే నడుపుతున్న ఉద్యమం ప్రైవేటీకరణ, కార్పొరేట్ శక్తి, ఆర్ధిక " సంస్కరణలకు " వ్యతిరేకంగా పల్లెత్తు మాట కూడా అనలేదు.
హజారేకు మద్దతు తెలిపిన కార్పోరేట్ మీడియా
అతిపెద్ద కార్పోరేట్ అవినీతి కుంభకోణాలు బయటపడినప్పుడు
(పెద్ద పెద్ద విలేఖరుల గుట్టు కూడా రట్టు అయ్యింది)
వాటినుంచి ప్రజల దృష్టిని మళ్ళించ డానికేప్రయత్నించింది.

రాజకీయ నాయకుల పట్ల ప్రజాగ్రహాన్ని సాకుగా చేసుకుని
ప్రభుత్వ అధికారాలను మరింత నీరు కార్చాలని, మరిన్ని సంస్కరణలు చేపట్టాలని, ప్రైవేటీకరణను వేగవంతం చెయ్యాలని ప్రచారం సాగించింది.
(2008 లో అన్నా హజారేకి విశిష్ట ప్రజాసేవకి గాను ప్రపంచ బ్యాంకు అవార్డు లభించింది).
అయన చేస్తున్న అవినీతి వ్యతిరేక ఉద్యమం
తమ విధానానికి సరిగ్గా సరిపోయిందని
వాషింగ్టన్ నుంచి ప్రపంచ బ్యాంకు ఒక ప్రకటన కూడా ఇచ్చింది.

అరుంధతీ రాయ్ (పెట్టుబడిదారీ విధానం ఒక ప్రేతాత్మ కథ)
...

ఆంధ్రజ్యోతి సౌజన్యంతో

పెట్టుబడిదారీ విధానం ఒక ప్రేతాత్మ కథ 
- అరుంధతీ రాయ్‌

తెలుగు అనువాదం: కె.సురేష్‌

44 పేజీలు, వెల: రూ.25/-

ప్రచురణ: మలుపు, హైదరాబాద్‌, తెలంగాణ రాష్ట్రం
ఫోన్‌: 09866559868

ప్రతులకు: 2-1-1/5, నల్లకుంట, హైదరాబాద్‌-500044
ఇమెయిల్‌ :  malupuhyd@gmail.com

No comments:

Post a Comment