Thursday 12 March 2015

పరాయి పాలనను ఎదిరించిన ఝాన్సీ, రచన: మహాశ్వేతాదేవి, అనువాదం: రివేరా, కృష్ణకాంత్‌

పరాయి పాలనను ఎదిరించిన 
ఝాన్సీ 
- మహాశ్వేతాదేవి

ఝాన్సీ లక్ష్మీబాయి జీవించి, పోరాడిన రోజులు గడిచిపోయి నూటాయాభై సంవత్సరాలయింది. ఆమె ఏ ఈస్టిండియా కంపెనీ దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడిందో, ఆ పోరాట ఫలితంగానే ఏడాది తిరక్కుండానే ఆ ఈస్టిండియా కంపెనీ పోయి స్వయంగా బ్రిటిష్‌ ప్రభుత్వ పాలన మొదలయింది. ఆ పాలన కూడా ముగిసి నల్లదొరలకు అధికార మార్పిడి జరిగి ఆరున్నర దశాబ్దాలు గడిచిపోయాయి. ఈ పుస్తక రచన జరిగి యాభై సంవత్సరాలు గడిచిపోయాయి.

ఇన్ని మార్పులు జరిగినా, కాలం చాలా ముందుకు జరిగినా, ఆ పోరాటానికీ, ఈ పుస్తకానికీ ప్రాసంగికత, ప్రాధాన్యత, అవసరం తగ్గిపోలేదు సరికదా, రోజురోజుకూ పెరుగుతున్నాయి. 


విభిన్న రూపాలలో కొనసాగుతున్న పరాయి పాలనను , దోపిడీ పీడనలను ఎదిరిస్తూ వీరోచితమైన, త్యాగభరితమైన, ఆశావహమైన ప్రజాపోరాటాలు ఇవాళ కూడా సాగుతున్నాయి. 

అందుకే ఇవాళ్టికీ ఝాన్సీ లక్ష్మీభాయి  పోరాటం గురించీ, ఆ పోరాట జ్ఞాపకాల గురించీ ఆలోచించవలసిన, తలచుకోవాల్సిన విషయాలు మిగిలే వున్నాయి.



పరాయి పాలనను ఎదిరించిన
ఝాన్సీ

రచన: మహాశ్వేతాదేవి,

అనువాదం: రివేరా, కృష్ణకాంత్‌
258 పేజీలు, వెల: రూ.150/-

ప్రచురణ: మలుపు బుక్స్‌ , హైదరాబాద్‌

ప్రతులకు : మలుపు, ఇం.నెం. 2-1-1/ 5, నల్లకుంట, హైదరాబాద్‌ - 500044
ఫోన్‌ నెం. 09866559868
ఇ మెయిల్‌ :  malupuhyd@gmail.com

No comments:

Post a Comment