ముందుమాట
హిరణ్మయేన పాత్రేణ సత్యసాపిహితం ముఖం!
సత్యం పూషన్నపావృణు సత్యధర్మాయ దృష్టయే!!
(సత్యం యొక్క ముఖాన్ని స్వర్ణ పాత్ర కప్పేసింది;
సత్యపూరిత ధర్మసందర్శనం కోసం ఓ పుషన్! దాన్ని తొలగించు)
- ఈశ్వరోపనిషత్తు
''సత్యం కల్పనకన్నా వింతైనది.
ఎందుకంటే, కల్పన తప్పనిసరిగా సాధ్యాసాధ్యాలకు కట్టుబడి ఉండవలసి వస్తుంది.
కానీ సత్యం కాదు-'' అని మార్క్ట్వైన్ వ్యాఖ్యానించాడు.
కానీ సత్యం యొక్క స్వభావం యుగాలుగా తత్వవేత్తలను
అబ్బురపరుస్తూనే ఉంది.
'పవిత్ర కలశం' (కళిజిగి స్త్రజీబిరిజి) లాగా దాన్ని విభిన్న వ్యక్తులు విభిన్న సమయాల్లో,
పరిస్థితుల్లో రకరకాలుగా దర్శించారు.
ఏకాగ్రచిత్తులై సత్యాన్ని శోధించే వాళ్ళు మాత్రం యితరుల సహాయాన్ని
ఆశించకుండా తమ చైతన్యమే తమకు మార్గదర్శనం చేస్తుంటే, కష్టాలు, విపత్తులతో కూడిన మార్గంలో ఒంటరిగా
ప్రయాణించవలసి ఉంటుంది.
గుజరాత్లో 2002లో జరిగిన కల్లోలభరిత ఘటనలకు, బూటకపు ఎన్కౌంటర్లకు సంబంధించి ఈ పుస్తకంలో వివరించిన సత్యాన్ని గురించిన పఠనం చాలా ఆసక్తికరంగా సాగుతుంది.
సుదీర్ఘకాలం పాటు సాగిన 'స్టింగ్' ఆపరేషన్లో విరివిగా ఉపయోగించిన రహస్య కెమెరాలు, రహస్య మైక్రోఫోన్లు అందించిన సమాచారంతో ఈ పుస్తకం పాఠకులకు లోతైన అవగాహన కలిగిస్తుందని రచయిత అభిప్రాయం. ఈ పుస్తకంలో ముందుకు తెచ్చిన సమాచారం వాస్తవాలను ప్రతిబింబిస్తున్నదా లేక ఆ ఘటనలకు సంబంధించి రచయిత దృక్పథమా అనేది నిర్ణయించుకోవలసిన నిర్ణేతలు మాత్రం పాఠకులే.
ప్రత్యక్ష సంభాషణలతో కూడిన కథనం వల్ల పఠనం ఆసక్తికరంగా సాగుతుంది. ఇక్కడ ఉల్లేఖించిన వాస్తవాలు ఏ మేరకు నిజమైనవనేది నిర్ణయించి ఈ దేశపు పౌరులకు చట్టబద్ధ పాలనలో విశ్వాసం పునరుధ్ధరించడానికి అవసరమైన చర్యచేపట్టవలసింది మాత్రం చట్టబద్ధ పాలనను అమలు చేయవలసిన అధికార యంత్రాంగమూ, ఆ చట్టానికి కాపలాగా నిలబడవలసిన రాజ్యాంగ యంత్రాంగమే.
ముంబయ్లో డిసెంబర్ 1992-జనవరి 1993 మధ్య జరిగిన మతకల్లోలాలు, హింసాత్మక ఘటనల గురించి
ఏర్పాటయిన విచారణా కమిషన్ జరిపిన విచారణ సందర్భంలో నాకు కలిగిన బాధాకరమైన అనుభవం, అటువంటి
కల్లోలాల బాధితుల పట్ల చాలా స్పష్టంగా కనిపించిన ఉపేక్షాభావం వలన నాకు అనిపించేదేమంటే - ఇటువంటి కల్లోలాలకు గల కారణాలను తెలుసుకోవడంలో, అవి పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు చేపట్టడంలో రాజ్య యంత్రాంగం, రాజ్యాంగ అధికారులు మరింత గంభీరమైన ప్రయత్నం చేయవలసి ఉంది.
ఈ పుస్తకంలో వర్ణించిన వాటన్నింటి నిజానిజాలను నిర్ధారించడం మనకు సాధ్యం కాకపోయినప్పటికీ రచయిత తాను సత్యమని నమ్మిన దాన్ని బయటపెట్టడానికి చేసిన ప్రయత్నాల్లో ప్రదర్శించిన ధైర్యసాహసాలను, అంకిత భావాన్ని ప్రశంసించకుండా ఉండలేం. ఆమెకూ, పరిశోధనాత్మక జర్నలిజంలో ఆమె సాహస యాత్రకూ అభినందనలు.
నిజాయితీరాహిత్యం, రాజకీయ చాణక్యం, మోసం పెరుగుతున్న ఈ రోజుల్లో పైవాటి అవసరం పెరుగుతున్నట్టే ఉంది.
- బి.ఎన్.శ్రీకృష్ణ
గుజరాత్ ఫైల్స్
- రానా అయ్యూబ్
వెల: రూ. 130
ప్రతులకు, వివరాలకు :
మలుపు,
2-1-1/5 ,
నల్లకుంట, హైదరాబాద్ - 500044
E MAIL ID : malupuhyd@gmail.com
Phone : 040 2767 8411
No comments:
Post a Comment